చెట్ల పొదల్లో సగం కుళ్లిన స్థితిలో 24 ఏళ్ల యువతి శవం.. ఎవరిదో గుర్తించి భర్తను నిలదీస్తే అతడి మాస్టర్ ప్లాన్ విని అంతా షాక్..!

ABN , First Publish Date - 2021-10-19T22:31:07+05:30 IST

ఆ యువతి సంవత్సరం క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులు భర్తతో కలిసి అత్తారింట్లో ఉండి ఆ తర్వాత పుట్టింటికి వచ్చేసింది. ఈ నెల 15న ఇంట్లోంచి బయటికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. మంగళవారం కుళ్లిన స్థితిలో చెట్ల పొదల్లో

చెట్ల పొదల్లో సగం కుళ్లిన స్థితిలో 24 ఏళ్ల యువతి శవం.. ఎవరిదో గుర్తించి భర్తను నిలదీస్తే అతడి మాస్టర్ ప్లాన్ విని అంతా షాక్..!

భోపాల్: ఆ యువతి సంవత్సరం క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులు భర్తతో కలిసి అత్తారింట్లో ఉండి ఆ తర్వాత పుట్టింటికి వచ్చేసింది. ఈ నెల 15న ఇంట్లోంచి బయటికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. మంగళవారం కుళ్లిన స్థితిలో చెట్ల పొదల్లో ఆ యువతి శవం కనిపించింది. అనుమానంతో ఆమె భర్తను పోలీసులు నిలదీశారు. అతడు చెప్పిన మాస్టర్ ప్లాన్ విని అంతా షాకయ్యారు. అసలు కథేంటంటే..


మధ్యప్రదేశ్‌లోని కోలార్ రోడ్ భోపాల్ వాసి అయిన శర్ద పాశ్వాన్ కుమార్తె 24 ఏళ్ల నైనా అలియాస్ శిఖా పాశ్వాన్ బ్యూటిషియన్‌. ఆమె తండ్రి శర్ద బ్యాంకు ఉద్యోగి. నైనా ఏడాది క్రితం కోకోనట్‌ఖేదా నిషత్పుర ప్రాంతానికి చెందిన రజత్ కైత్వాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నైనా పెళ్లి తర్వాత ఒక నెల భర్తతో కలిసి అత్తారింట్లోనే ఉంది. ఆ తర్వాత పుట్టింటికి వచ్చి తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. అత్తారింటికి వెళ్లడం ఇష్టం లేక ఆమె భర్త మీద భరణం కేసు కూడా వేసింది. అయితే ఈ నెల 15న సాయంత్రం నైనా దుర్గామాత మండపం దగ్గరికి వెళ్తున్నాని తల్లికి చెప్పి ఇక తిరిగి రాలేదు. కూతురు కోసం రాత్రంతా ఎదురుచూసిన తల్లిదండ్రులు మరుసటి రోజు ఉదయమే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోలార్ పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే సెహోర్ పోలీసులు మిడ్‌ఘాట్ సెక్షన్ నేషనల్ హైవే 69 దగ్గర్లోని బుద్లీ చెట్లపొదల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆమెను నైనాగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. 


పోలీసులు అనుమానంతో నైనా భర్తను నిలదీయగా అతడు చెప్పిన మాస్టర్ ప్లాన్ విని అంతా షాకయ్యారు. దుర్గామాత మండంపం దగ్గర కనిపించిన నైనాను తనే బైక్‌పై ఎక్కించుకుని వెళ్లి హత్య చేసినట్లు రజత్ తెలిపాడు. హత్య తర్వాత భోపాల్‌లో బైక్‌ను తగలబెట్టి ఇంటికి వెళ్లానని చెప్పాడు. ఎస్పీ సమీర్ యాదవ్ మాట్లాడుతూ.. నిందితుడు యువతిని మొదట కత్తితో పొడిచాడని.. ఆ తర్వాత తలపై బండరాయితో మోదీ హత్య చేశాడని అన్నారు. యువతి గొంతు కూడా నొక్కి చంపాడని పోలీసులు తెలిపారు. ప్లాన్ ప్రకారమే నిందితుడు భార్యను హత్య చేశాడని అన్నారు.

Updated Date - 2021-10-19T22:31:07+05:30 IST