ఐసోలేషన్ నుంచి 25 మంది డిశ్చార్జి
ABN , First Publish Date - 2020-05-30T11:06:24+05:30 IST
కరోనా పాజిటివ్తో ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న 25 మంది శుక్రవారం డిశ్చార్జి అయ్యారు.
ఒకరికి కరోనా పాజిటివ్
నెల్లూరు(వైద్యం) మే 29 : కరోనా పాజిటివ్తో ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న 25 మంది శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. వీరిలో సూళ్లూరుపేటకు చెందిన వారు 17 మంది ఉండగా, నెల్లూరుకు చెందిన ఇద్దరు, మనుబోలు, వింజమూరు, కొడవలూరు, కోట, గూడూరు, సంగం మండలానికి చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. కాగా, సూళ్లూరుపేటలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 241కి చేరింది. ఇప్పటి వరకు 180 మంది డిశ్చార్జి అయ్యారు.