25 మంది వైద్యుల సర్జరీ.. కోలుకుంటున్న బిలియనీర్ వ్యాపారవేత్త యూసుఫ్ అలీ

ABN , First Publish Date - 2021-04-16T22:09:50+05:30 IST

అబుదాబికి చెందిన భారతీయ వ్యాపారవేత్త, లులు గ్రూప్ చైర్మన్ ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి

25 మంది వైద్యుల సర్జరీ.. కోలుకుంటున్న బిలియనీర్ వ్యాపారవేత్త యూసుఫ్ అలీ

అబుదాబి: అబుదాబికి చెందిన భారతీయ వ్యాపారవేత్త, లులు గ్రూప్ చైర్మన్ ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కొచ్చిలో ఈ నెల 11న ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ చిత్తడి నేలపై క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. అబుదాబిలోని రాజ కుటుంబం పంపిన ప్రత్యేక విమానంలో సోమవారం అలీ అబుదాబి చేరుకున్నారు.


అనంతరం బుర్జీల్ ఆసుపత్రిలో చేరారు. అక్కడాయనకు మంగళవారం ప్రఖ్యాత న్యూరో సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ షావర్బీ నేతృత్వంలోని 25 మంది వైద్యుల బృందం వెన్నెముక శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించింది. ఈ మేరకు గత రాత్రి లులు గ్రూప్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని పేర్కొంది.


కేరళ పర్యటనలో ఉన్న యూసుఫ్ అలీ ఈ నెల 11న  భార్యతో కలిసి హెలికాప్టర్‌లో వెళ్తున్న సమయంలో భారీ వర్షాల కారణంగా హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయింది. ఆ సమయంలో యూసుఫ్ అలీ దంపతులతోపాటు ఇద్దరు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. అనంతరం వారందరినీ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. పెను ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2021-04-16T22:09:50+05:30 IST