240 కేజీల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-01-18T05:35:36+05:30 IST

శాఖ నుంచి నుంచి బిహార్‌కు కంటైనర్‌ లారీలో తరలిస్తున్న 240 కేజీ గంజాయిని పట్టుకున్నట్లు ఎస్‌ఐ కె.శ్రీహరిరావు తెలిపారు.

240 కేజీల గంజాయి పట్టివేత
పట్టుబడిన గంజాయి, నిందితులు

దేవరపల్లి, జనవరి 17: విశాఖ నుంచి నుంచి బిహార్‌కు కంటైనర్‌ లారీలో తరలిస్తున్న 240 కేజీ గంజాయిని పట్టుకున్నట్లు ఎస్‌ఐ కె.శ్రీహరిరావు తెలిపారు. దేవరపల్లి హైవే రింగురోడ్డు వద్ద కంటైనర్‌ను తనిఖీ చేయగా కోడిగుడ్లు అట్టల మధ్యలో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. పట్టుబడిన గం జాయి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందన్నారు. విశాఖపట్నంకు చెందిన రన్‌ విజయ్‌ అధిక కిరాయి ఆశ చూపడంతో రవాణాకు ఒప్పుకున్నట్లు లారీ డ్రైవర్‌ చెప్పాడన్నారన్నారు. గంజాయి స్వాధీనం చేసుకుని బిహార్‌కు చెందిన వసంత్‌యాదవ్‌, గులామ్‌ జిలాని, నిజా ముద్దీన్‌లను సోమవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. రన్‌ విజయ్‌ని అరెస్టు చేయా ల్సి ఉంది. గంజాయి స్వాధీనం చేసుకుని రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో తూకం వేసి విలువను పోలీసు అధికారులు నిర్ధారించారు.

Updated Date - 2022-01-18T05:35:36+05:30 IST