255 మందికి పాజిటివ్‌: ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2021-08-30T06:56:59+05:30 IST

జిల్లాలో శని, ఆదివారాల నడుమ 24 గంటల్లో 255 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ముగ్గురు మరణించినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది.

255 మందికి పాజిటివ్‌: ముగ్గురి మృతి

తిరుపతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శని, ఆదివారాల నడుమ 24 గంటల్లో 255 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ముగ్గురు మరణించినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. దీంతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 237702కు, కొవిడ్‌ మరణాలు 1840కు చేరాయి. 2060 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా కరోనా కేసులు.. తిరుపతిఅర్బన్‌లో 54, చిత్తూరులో 27, శ్రీకాళహస్తిలో 15, తిరుపతి రూరల్‌లో 14, చంద్రగిరిలో 12, సదుంలో 11, పీలేరులో 8, రేణిగుంట, సోమల, మదనపల్లె మండలాల్లో 7చొప్పున, కలికిరి, పుంగనూరు, రామకుప్పం మండలాల్లో 6 వంతున, పులిచెర్లలో 5, ఏర్పేడు, పాకాల, గుర్రంకొండ మండలాల్లో 4చొప్పున, గుడిపల్లె, ఎర్రవారిపాళెం, తవణంపల్లె, ఐరాల, వడమాలపేట, పుత్తూరు, కురబలకోట మండలాల్లో 3 వంతున, కంభంవారిపల్లె, పూతలపట్టు, వెదురుకుప్పం, యాదమరి, వాల్మీకిపురం, రొంపిచెర్ల, వరదయ్యపాళెం, ములకలచెరువు, నిండ్ర, పలమనేరు మండలాల్లో 2చొప్పున, బంగారుపాళ్యం, చిన్నగొట్టిగల్లు, తొట్టంబేడు, గంగవరం, కుప్పం, బుచ్చినాయుడుకండ్రిగ, శ్రీరంగరాజపురం, సత్యవేడు, కార్వేటినగరం, చౌడేపల్లె, నాగలాపురం, గంగాధరనెల్లూరు, తంబళ్లపల్లె, పెద్దతిమ్మసముద్రం, బి.కొత్తకోట, నగరి మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. 

Updated Date - 2021-08-30T06:56:59+05:30 IST