ఆ 256 మంది పాన్, సమోసాలు విక్రయిస్తూ కోటీశ్వరులయ్యారు!

ABN , First Publish Date - 2021-07-22T14:07:54+05:30 IST

యూపీలోని కాన్సూర్‌లో రోడ్డు పక్కన బడ్డీకొట్టు పెట్టుకుని...

ఆ 256 మంది పాన్, సమోసాలు విక్రయిస్తూ కోటీశ్వరులయ్యారు!

కాన్పూర్: యూపీలోని కాన్సూర్‌లో  రోడ్డు పక్కన బడ్డీకొట్టు పెట్టుకుని పాన్, సమోసా, చాట్ మొదలైనవి విక్రయించే 256 మంది చిరువ్యాపారులు కోటీశ్వరులయ్యారని ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేసిన తనిఖీలలో వెల్లడయ్యింది. పైగా వీరిలోని చాలామంది దగ్గర మూడేసి కార్లతో పాటు, కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తున్నట్లు తేలింది. 


అలాగే పండ్లు విక్రయించేవారు కూడా విలువైన భూములు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన బిగ్ డేటా సాఫ్ట్‌వేర్, జీఎస్టీ రిజిస్ట్రేషన్ తనిఖీలలో 256 మంది పేదలు కోటీశ్వరులుగా మారారని తేలింది. రోడ్డు పక్కన వ్యాపారం సాగించే చిరువ్యాపారులు కోటీశ్వరులుగా మారినప్పటికీ ఆదాయపు పన్ను, జీఎస్టీ లాంటివి చెల్లించరు. ఇప్పుడు ఇటువంటి వారిపై ఆదాయపన్నుశాఖ అధికారులు, జీఎస్టీ అధికారులు దృష్టి సారించారు. రోడ్డు పక్కన చిల్లర వ్యాపారాలు నిర్వహిస్తున్న వారంతా అధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నప్పటికీ, అధికారికంగా పేదలుగా చెలామణీ అవుతున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2021-07-22T14:07:54+05:30 IST