260 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-10-16T06:45:27+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇరు జిల్లాలో గురువారం 260పాజిటివ్ కేసులు
కొత్తగూడెం కలెక్టరేట్, అక్టోబరు 15: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇరు జిల్లాలో గురువారం 260పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో ఖమ్మం జిల్లాలో 91పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలో 169 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 2,918 మందికి పరీక్షలు నిర్వహించగా 169 మందికి పాజిటివ్ తేలింది. కొత్తగూడెం డివిజన్లో 114, భద్రాచలం డివిజన్లో 55 కేసులు నమోదయ్యాయి.