తెలంగాణలో కొత్తగా 2606 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-09T02:06:35+05:30 IST

తెలంగాణలో రోజురోజుకి కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2606 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 2606 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1583, మేడ్చల్ 292, రంగారెడ్డిలో 214 కరోనా కేసులు నమోదయ్యాయి. 


కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

వరంగల్:  నగరంలోని కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం స‌‌ృష్టించింది. 20 మంది మెడికోలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో  ఇతర విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందోతోంది. రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. 


Updated Date - 2022-01-09T02:06:35+05:30 IST