యూపీలో కొత్తగా 263 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-23T02:05:56+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 263 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ వెల్లడించారు.

యూపీలో కొత్తగా 263 కరోనా కేసులు

లక్నో: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 263 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,243కు చేరిందని ఆయన శుక్రవారం తెలియజేశారు. అలాగే ఇప్పటివరకు మొత్తమ్మీద 3,238 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు చెప్పారు. అయితే గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా రాష్ట్రంలో సంభవించలేదని స్పష్టంచేశారు.

Updated Date - 2020-05-23T02:05:56+05:30 IST