ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. స్వల్పంగా గాయపడ్డ భారతీయులు!

ABN , First Publish Date - 2021-01-14T17:02:01+05:30 IST

భారతీయులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైన ఘటన దుబాయిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లో

ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. స్వల్పంగా గాయపడ్డ భారతీయులు!

అబుధాబి: భారతీయులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైన ఘటన దుబాయిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన కొంత మంది ఉద్యోగులు దుబాయిలోని జెబెల్ అలీ ఇండస్ట్రీయల్ ఏరియాలో ఉన్న పర్‌ఫ్యూమ్ ఫ్యాక్టరీలో గత కొంతకాలంగా పని చేస్తున్నారు. బుధవారం రోజు వారు తమ సహోద్యోగులతో కలిసి ఫ్యాక్టరీకి వెళ్తుండగా.. వాళ్లు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు.. ఓ ట్రక్కును ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 27 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఇందులో అత్యధికులు భారతీయులే ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దుబాయిలోని ఎన్ఎమ్‌సీ రాయలే ఆసుపత్రికి తరలించారు. కాగా.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు చెప్పారు.

Updated Date - 2021-01-14T17:02:01+05:30 IST