chennai: 28 నుంచి టీఆర్‌బీ పరీక్షలు

ABN , First Publish Date - 2021-10-14T15:08:45+05:30 IST

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(టీఆర్‌బీ) ఈనెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనుం

chennai: 28 నుంచి టీఆర్‌బీ పరీక్షలు

ఐసిఎఫ్‌(చెన్నై): ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(టీఆర్‌బీ) ఈనెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనుంది. కంప్యూటర్‌ సైన్స్‌, ప్రింట్‌ టెక్నాలజీ పాఠ్యాంశాలకు సంబంధించి 28వ తేదీ ఉదయం, ఫిజిక్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, మోడ్రన్‌ ఆఫీస్‌ ప్రాక్టీస్‌ పాఠ్యాంశాలకు మధ్యాహ్నం పరీక్ష జరుగనుంది. 29వ తేదీ ఉదయం గణితం, ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌, మధ్యాహ్నం ఈఈఈ, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, 30వ తేదీ ఉదయం ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కంట్రోల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, మధ్యాహ్నం ఈసీఈ పాఠ్యాంశానికి పరీక్షలు జరుగుతాయి. 31వ తేదీ ఉదయం ఎంఈ, మధ్యాహ్నం కెమిస్ట్రీ, ఆంగ్లం పాఠ్యాంశాల పరీక్షలు జరుగనున్నాయని టీఆర్‌బీ తెలియజేసింది.

Updated Date - 2021-10-14T15:08:45+05:30 IST