28 మంది మెట్రో సిబ్బందికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-10-01T12:01:29+05:30 IST
లాక్డౌన్ అనంతరం సెప్టెంబరు 7 నుంచి బెంగళూరు మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ 28 మంది మెట్రో సిబ్బందికి కరోనా సోకింది.
బెంగళూరు: లాక్డౌన్ అనంతరం సెప్టెంబరు 7 నుంచి బెంగళూరు మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ 28 మంది మెట్రో సిబ్బందికి కరోనా సోకింది. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఎంఆర్సీఎల్) అధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. కరోనా బారిన పడినవారంతా ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారన్నారు.
కాగా కరోనాను కట్టడి చేసే ఉద్దేశంతో మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలను నిలిపివేశారు. ఇటీవలే ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర మెట్రో సేవలు ప్రారంభంకాగా, అక్టోబర్ 4 నుంచి కోల్కతా మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కోల్కతా మెట్రో అధికారి ఒకరు మాట్లాడుతూ అక్టోబరు 4 నుంచి తొలుత నావోపాడా- కవి సుభాష్ స్టేషన్ల మధ్య మెట్రోసేవలు ప్రారంభమవుతాయిని తెలిపారు.