నకిలీ తుపాకీ అనుకొని.. కాల్చుకొని యువకుడు మృతి!
ABN , First Publish Date - 2020-06-06T03:59:50+05:30 IST
మహారాష్ట్రలోని థానేలో ఘోరం జరిగింది. ఓ హౌసింగ్ కాలనీలో జరిగిన జాయింట్ బర్త్డే పార్టీకి వచ్చిన ఓ యువకుడు..
ముంబై: మహారాష్ట్రలోని థానేలో ఘోరం జరిగింది. ఓ హౌసింగ్ కాలనీలో జరిగిన జాయింట్ బర్త్డే పార్టీకి వచ్చిన ఓ 28ఏళ్ల యువకుడు.. బొమ్మ తుపాకీ అనుకొని, నిజం గన్తో పొరబాటున తనను తానే కాల్చుకొని మరణించాడు. బర్త్డే పార్టీ జరుగుతుండగా.. ఆ యువకుడికి ఓ తుపాకీ కనిపించింది. అది బొమ్మ తుపాకీ అనుకొని తనను తాను కాల్చుకోవడంతో సదరు యువకుడు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఆ తుపాకీ యజమానిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.