ఏపీలో కొత్తగా 2,905 కరోనా కేసులు, 16 మరణాలు
ABN , First Publish Date - 2020-10-30T01:56:52+05:30 IST
బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 2,905 కరోనా కేసులు నమోదయ్యారు. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో
అమరావతి: బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 2,905 కరోనా కేసులు నమోదయ్యారు. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 8,17,679కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 16 మంది మృతి చెందారు. ఇప్పటవరకు కరోనాతో రాష్ట్రంలో 6,659 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 26,268 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 78,4,752 మంది రికవరీ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు 78,62,459 కరోనా టెస్టుల నిర్వహంచారు.
కరోనాతో కొత్తగా కృష్ణా 3, అనంతపురం, చిత్తూరులో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, కడపలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. గుంటూరు, నెల్లూరు, విశాఖ, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు చొప్పున మృతి చెందారు.