ముగిసిన రెండో రోజు ఆట.. ఇండియా 85/2

ABN , First Publish Date - 2022-01-05T03:01:25+05:30 IST

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి

ముగిసిన రెండో రోజు ఆట.. ఇండియా 85/2

జొహన్నెస్‌బర్గ్: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. ఫలితంగా ప్రత్యర్థి జట్టుపై భారత్‌కు 58 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన పుజారా (35), రహానే (11) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో రాణించిన కెప్టెన్ కేఎల్  రాహుల్ ఈసారి 8 పరుగులకు పెవిలియన్ చేరగా, మయాంక్ అగర్వాల్ (23) మరోమారు తడబడ్డాడు.


అంతకుముందు సౌతాఫ్రికా 229 పరుగులకు ఆలౌట్ అయింది. కీగన్ పీటర్సెస్ 62 పరుగులు చేయగా, తెంబా బవుమ 51 పరుగులు చేశారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు. షమీకి రెండు, బుమ్రాకు ఒక వికెట్ దక్కింది.

Updated Date - 2022-01-05T03:01:25+05:30 IST