ఆస్పత్రి బెడ్ బ్లాక్ లో అమ్మినందుకు ముగ్గురు అరెస్ట్
ABN , First Publish Date - 2021-05-06T22:52:04+05:30 IST
ఆస్పత్రి బెడ్ బ్లాక్ లో అమ్మినందుకు ముగ్గురు అరెస్ట్
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో కోవిడ్ కేసులు రోజువారీగా భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. కోవిడ్ రోగులకు ఆస్పత్రుల్లో బెడ్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. బెంగళూరులో ఓ ఆస్పత్రి బెడ్లను బ్లాక్ మార్కెటింగ్ చేసినందుకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ గురువారం తెలియజేశారు. కోవిడ్ పాజిటివ్ రోగి కుటుంబం నుంచి నిందితుడు రూ. 1.2 లక్షలు డిమాండ్ చేసి దోపిడీ చేశాడని ఆయన తెలిపారు. అయితే బాధితుడు ప్రవేశం పొందిన కొన్ని గంటల తరువాత మరణించాడని పంత్ ట్వీట్ చేశారు.