3 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనంగా ఏసీ బోగీలు

ABN , First Publish Date - 2021-08-04T12:38:39+05:30 IST

స్థానిక ఎగ్మూరు రైల్వేస్టేషన్‌ నుంచి దక్షిణాది ప్రాంతాలవైపు వెళ్ళే మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళకు కొత్తగా ఒక్కో ఏసీ బోగీని చేర్చినట్లు దక్షిణ రైల్వే అధికారులు ప్రకటించారు. ఎగ్మూరు నుంచిమదురై, తిరుచ్చి వెళ్ళే

3 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనంగా ఏసీ బోగీలు

చెన్నై: స్థానిక ఎగ్మూరు రైల్వేస్టేషన్‌ నుంచి దక్షిణాది ప్రాంతాలవైపు వెళ్ళే మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళకు కొత్తగా ఒక్కో ఏసీ బోగీని చేర్చినట్లు దక్షిణ రైల్వే అధికారులు ప్రకటించారు. ఎగ్మూరు నుంచిమదురై, తిరుచ్చి వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఈ అదనపు ఏసీ బోగీ సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. మదురై నుంచి ఎగ్మూరు వచ్చే మదురై స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (నెం.02638)కు ఉన్న సెకండ్‌ క్లాస్‌ స్లీపర్‌ను ఈ నెల 23న తొలగించి ఏసీ బోగీ బిగించనున్నట్లు తెలిపారు. చెన్నై నుంచి మదురై వెళ్లే (నెం.02637)రైలుకు ఉన్న సెకెండ్‌ క్లాస్‌ స్లీపర్‌ను ఈ నెల 26న తొలగించిన ఏసీ బోగీని అమర్చనున్నట్లు తెలిపారు. ఎగ్మూరు నుంచి తిరుచ్చికి వెళ్లే ప్రత్యేక రైలు (నెం: 06795)కు ఉన్న స్లీపర్‌ను ఈ నెల 24న తొలగించి ఏసీ బోగీని చేర్చి నడుపనున్నారు. ఇదే విధంగా తిరుచ్చి నుంచి ఎగ్మూరుకు వచ్చే ప్రత్యేక రైలు (నెం:06796) కు ఉన్న స్లీపర్‌ను ఈ నెల 26న తొలగించి ఏసీ బోగీని చేర్చి నడుపుతారు. తిరుచ్చి నుంచి ఎగ్మూరుకు, ఎగ్మూరు నుంచి తిరుచ్చికి వెళ్ళే ప్రత్యేక రైలు (నెం: 02654)కు ఉన్న స్లీపర్‌ను ఈ నెల 24న తొలగించి ఏసీ బోగీని కల్పిఇ నడుపుతారు. ఎగ్మూరు నుంచి తిరుచ్చి వెళ్లే ప్రత్యేక రైలు (నెం: 02653)కు ఉన్న స్లీపర్‌ను ఈ నెల 25న తొలగించి ఏసీ బోగీని బిగించి నడుపనున్నారు.

Updated Date - 2021-08-04T12:38:39+05:30 IST