రూ.3 లక్షల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-22T05:17:24+05:30 IST

ఎటపాక మండలం పురుషోత్తపట్నం ఇసుక చెక్‌ పోస్టు వద్ద గురువారం రూ.3 లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకు న్నారు.

రూ.3 లక్షల గంజాయి స్వాధీనం

ఎటపాక, అక్టోబరు 21: ఎటపాక మండలం పురుషోత్తపట్నం ఇసుక చెక్‌ పోస్టు వద్ద గురువారం రూ.3 లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకు న్నారు. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. చింతూరు నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న కారుని ఆపి తనిఖీ చేయగా నాలుగు బ్యాగుల్లో 100 కిలోల గంజాయిని స్వాధీనం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిని సీలేరు అటవీ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు ఎస్‌ఐ చినబాబు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన దత్తాత్రేయ చవాన్‌, తుషార్‌ భరత్‌ కాంబ్లేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-10-22T05:17:24+05:30 IST