పంజాబ్ సీఎం కుటుంబంలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-08T22:20:42+05:30 IST
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ ఛన్ని కుటుంబంలోని ముగ్గురు సభ్యులకు కోవిడ్ పాజిటివ్..
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్ని కుటుంబంలోని ముగ్గురు సభ్యులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వైద్యపరీక్షల్లో కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు మొహలి సివిల్ సర్జన్ డాక్టర్ ఆదర్శ్పాల్ కౌర్ శనివారం తెలిపారు. అయితే, ముఖ్యమంత్రికి మాత్రం వైద్య పరీక్షల్లో కోవిడ్ నెగిటివ్ వచ్చిందన్నారు. ఛన్నీ భార్య కమల్జిత్ కౌర్, ఆయన కుమారుడు నవ్జిత్ సింగ్, కోడలు సిమ్రాన్థీర్ కౌర్లకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వీరిలో కోవిడ్ లక్షణాలు చాలా స్పల్పంగానే కనిపించాయని, ప్రస్తుతం హోం ఐసొలేషన్లో ఉన్నారని కౌర్ చెప్పారు.