బిల్లు కట్టాలని అడిగాడని.. పానీపూరీ అమ్మే వ్యక్తిని చావబాదిన ముగ్గురు!

ABN , First Publish Date - 2021-03-23T11:38:46+05:30 IST

భారతదేశంలో ఏ మూలకు వెళ్లినా పానీపూరీకి అభిమానులు ఉంటారు. ఈ చిరుతిండి అంత పాపులర్ మరి. అందుకే తక్కువ పెట్టుబడితో లాభం సంపాదించాలని అనుకునే చాలా మంది పేదవారు పానీపూరీనే నమ్ముకుంటారు.

బిల్లు కట్టాలని అడిగాడని.. పానీపూరీ అమ్మే వ్యక్తిని చావబాదిన ముగ్గురు!

పూణే: భారతదేశంలో ఏ మూలకు వెళ్లినా పానీపూరీకి అభిమానులు ఉంటారు. ఈ చిరుతిండి అంత పాపులర్ మరి. అందుకే తక్కువ పెట్టుబడితో లాభం సంపాదించాలని అనుకునే చాలా మంది పేదవారు పానీపూరీనే నమ్ముకుంటారు. పానీపూరీ అమ్ముకునే చిన్న బండి పెట్టుకొని జీవనం సాగిస్తుంటారు. ఇలా జీవిస్తున్న ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. మహారాష్ట్రలోని పూణేలో పానీపూరీ బండి పెట్టుకొని ఉన్న ఓ 19 ఏళ్ల యువకుడు.. శుభ్రంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. పూణే కాలేజిలో చదువుకుంటూ ఆర్థిక ఇబ్బందులతో ఇలా పానీపూరీ బండి నడుపుతున్న అతన్ని ముగ్గురు దుండగులు చావబాదారు. ఎందుకో తెలుసా? పానీపూరీ బాగా తిన్నాక బిల్లు కట్టాలని సదరు విద్యార్థి అడిగాడని. ఈ ముగ్గురు దుండగుల్లో ఇద్దరు ఆ విద్యార్థి నివశించే ప్రాంతంలోనే నివశిస్తారని పోలీసులు తెలిపారు. పానీపూరీ బిల్లు కట్టాలని అడిగితే ఆ యువకుడిని చావబాదారని, వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వారు వెల్లడించారు.

Updated Date - 2021-03-23T11:38:46+05:30 IST