కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు మృతి
ABN , First Publish Date - 2022-01-21T04:43:45+05:30 IST
మండలంలోని కీర్తిపల్లెలో కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు మృతి చెందాయి.
వీరపునాయునిపల్లె, జనవరి 20: మండలంలోని కీర్తిపల్లెలో కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు మృతి చెందాయి. గొర్రెల కాపరులు వేసుకున్న దొడ్లోని 30 గొర్రె పిల్లలు ఉండగా రెండు కుక్కలు వాటిపై దాడి చేసి చంపినట్లు బాధితుడు నూకనబోయిన కృష్ణయ్య తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే పంచాయతీ కార్యదర్శి విజయ్కుమార్నాయక్ గ్రామానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు.