30 వేలు దాటాయ్
ABN , First Publish Date - 2020-08-13T08:37:28+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు 30 వేలు దాటాయి. బుధవారం కొత్తగా 781 మంది
జిల్లాలో కొత్తగా 781 మందికి కరోనా
30,233కు చేరిన బాధితుల సంఖ్య
నలుగురి మృతి
కర్నూలు(హాస్పిటల్), ఆగస్టు 12: జిల్లాలో కరోనా కేసులు 30 వేలు దాటాయి. బుధవారం కొత్తగా 781 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 30,233కు చేరింది. వీరిలో 10,385 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 19,590 మంది డిశ్చార్జి అయ్యారు. జిల్లాలో మరో నలుగురు కొవిడ్ బాధి తులు మృతి చెందగా, మరణాల సంఖ్య 258కి చేరింది.
డోన్ ఎంపీడీవో కార్యాలయంలో ఏడుగురు కరోనా బారిన పడ్డారు.
ఆలూరులో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా సోకింది. వీరిలో నాలుగు సంవత్సరాలు, 9 సంవత్సరాల చిన్నారులు ఉన్నారు.
ఎమ్మిగనూరులో కొత్తగా 69 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరిలో నలుగురు సచివాలయ సిబ్బంది ఉన్నారు.
కోసిగిలో 148 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో పది మంది గర్భిణులు ఉన్నారు.
శ్రీశైలంలో మూడు, సున్నిపెంటలో పది కేసులు వచ్చాయి.
ఆదోనిలో 16 కేసులు.. రూరల్లో 14 కేసులు నమోదయ్యాయి.