301 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-09-25T11:07:52+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం కొత్తగా 301 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఖమ్మం జిల్లాలో 86కేసులు నమోదవ్వగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 215కేసులు నమోదయ్యాయి.
కొత్తగూడెం కలెక్టరేట్/ఖమ్మం సంక్షేమం, సెప్టెంబర్ 24: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం కొత్తగా 301 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఖమ్మం జిల్లాలో 86కేసులు నమోదవ్వగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 215కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో మొత్తం 2,493 మందికి పరీక్షలు నిర్వహించగా 215పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగూడెం డివిజన్లో 122, భద్రాచలం డివిజన్లో 93 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.