మరో 31 మందికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-12-01T06:52:23+05:30 IST
మరో 31 మందికి కరోనా పాజిటివ్
తిరుపతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆది, సోమవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 31 మందికి కరోనా వైరస్ సోకినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. అదే సమయంలో వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86350కి, మరణాల సంఖ్య 827కు చేరాయి. తాజాగా గుర్తించిన పాజిటివ్ కేసులు తిరుపతి నగరంలో 13, చిత్తూరులో 5, పులిచెర్ల, పుత్తూరు మండలాల్లో 2 చొప్పున, చంద్రగిరి, కలకడ, మదనపల్లె, నగరి, పలమ నేరు, రేణిగుంట, సత్యవేడు, శ్రీకాళహస్తి మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.