కరోనాపై విజయం : వైద్య బృందానికి రివార్డు ప్రకటించిన ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2020-04-10T04:07:23+05:30 IST

మణిపూర్ రాష్ట్రానికి చెందిన తొలి కరోనా రోగిని ఆరోగ్యవంతుణ్ణి చేసిన వైద్య బృందానికి ప్రభుత్వం భారీ రివార్డు ప్రకటించింది.

కరోనాపై విజయం : వైద్య బృందానికి రివార్డు ప్రకటించిన ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ: మణిపూర్ రాష్ట్రానికి చెందిన తొలి కరోనా రోగికి చికిత్స చేసిన వైద్య బృందానికి ప్రభుత్వం భారీ రివార్డు ప్రకటించింది. జవహర్‌లాల్ నెహ్రూ ఇస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన వైద్య బృందానికి మణిపూర్ ముఖ్య మంత్రి బిరేన్ సింగ్ రూ. 35 లక్షల రివార్డును ప్రకటించారు.  బ్రిటన్ నుంచి మణిపూర్ వచ్చిన 23 ఏళ్ల యువతికి మార్చి 24న కరోనా సోకినట్టు వెల్లడైంది. ఇది ఆ రాష్ట్రంలో నమోదైన తొలికరోనా కేసు. అయితే డాక్టర్ల శ్రమ ఫలించడంతో ఆమెకు వ్యాధి నయమైంది. సోమవారం నాడు జరిపిన పరీక్షల్లో కరోనా పూర్తిగా నయమైనట్టు తేలడంతో ఆమెను డిశ్చార్జ్ అయింది. 

Updated Date - 2020-04-10T04:07:23+05:30 IST