ఉద్యోగరీత్యా సిటీలో ఉంటున్న భర్త.. పొలానికి వెళ్లిన భార్య రాత్రయినా రాలేదేంటని బంధువులకు డౌట్.. చెరకుతోటలో కనిపించిన సీన్ చూసి..

ABN , First Publish Date - 2021-10-24T11:56:07+05:30 IST

రాత్రిపూట పొలంలో గడ్డికోసం పొలానికి వెళ్లిన మహిళ ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు ఆమెను వెతకడానకి వెళ్లారు. ఇంటి వద్ద ఆమెకోసం పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. ఎంత వెతికినా ఆమె తిరిగి రాలేదు

ఉద్యోగరీత్యా సిటీలో ఉంటున్న భర్త.. పొలానికి వెళ్లిన భార్య రాత్రయినా రాలేదేంటని బంధువులకు డౌట్.. చెరకుతోటలో కనిపించిన సీన్ చూసి..

రాత్రిపూట పొలంలో గడ్డికోసం పొలానికి వెళ్లిన మహిళ ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు ఆమెను వెతకడానకి వెళ్లారు. ఇంటి వద్ద ఆమెకోసం పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. ఎంత వెతికినా ఆమె తిరిగి రాలేదు. అసలు ఏం జరిగిదంటే..


బిహార్లోని ముజఫర్‌పూర్ సమీపంలో ఉన్న ఛవగ్రహియా గ్రామంలో అనోజ్ రామ్, ప్రతిమ దేవి దంపతులు నివసిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. ఉద్యోగరీత్యా అనోజ్ రాం కేరళకు వెళ్లగా ప్రతిమ దేవి(35) ఇంటివద్ద ఆవులను మేపుకొని, పొలం పని చూసుకొనేది. శుక్రవారం రాత్రి ఇంట్లోని పశువులకు మేతలేకపోవడంతో వాటికోసం గడ్డి తీసుకురావడానికి ప్రతిమ దేవి పొలానికి వెళ్లింది. ఇంటి ఆమె ముగ్గురు పిల్లలను వదిలి వెళ్లింది. అలా వెళ్లిన ఆమె ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో.. పిల్లలు ఏడుస్తూ ఉన్నారు.


అర్ధరాత్రి పిల్లల ఏడుపులకు పొరుగున ఉన్న వారి బంధువుల వచ్చారు. పిల్లలను వాళ్ల అమ్మ గురించి అడిగితే పొలం వెళ్లిందని చెప్పారు. ఇక వారికోసం ఆ గ్రామస్తులంతా వెతకడం ప్రారంభించారు. వారు ఎంత వెతికినా ఆమె జాడ కనిపించలేదు. తెల్లవారుఝామున ప్రతిమ దేవి శవం ఒక చెరుకు తోటలో కనిపించింది. ఆమెను ఎవరో గొంతు నులిమి చంపారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారమందించారు. ఆ గ్రామంలో గత 20 రోజులలో ఇది మూడవ హత్య కావడంతో.. గ్రామస్తులు పోలీసులు హంతకులని ఎందుకు పట్టుకోవడంలేదని ప్రశ్నించారు. ఇంతకుముందు అదే గ్రామంలో కూరగాయలు అమ్ముకునే ఒక వ్యక్తి, మరొక 15 సంవత్సరాల అబ్బాయి హత్యచేయబడ్డారు.


పోలీసుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో గ్రామస్తులంతా పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. హంతకులను త్వరగా పట్టుకొని, మృతురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఎలాగోలా వారికి నచ్చజెప్పారు.

Updated Date - 2021-10-24T11:56:07+05:30 IST