Covid 19: 70 దేశాల్లో.. 3,570 మంది భారతీయులు మృతి

ABN , First Publish Date - 2021-07-30T02:19:31+05:30 IST

కరోనా కాటుకు 70దేశాల్లో సుమారు 3,570 మంది భారతీయులు బలైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఓ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి వీ.మురళీధర

Covid 19: 70 దేశాల్లో.. 3,570 మంది భారతీయులు మృతి

న్యూఢిల్లీ: కరోనా కాటుకు 70దేశాల్లో సుమారు 3,570 మంది భారతీయులు బలైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి వీ.మురళీధరన్ స్పందించారు. మహమ్మారి కారణంగా దాదాపు 3,570 మంది భారతీయులు విదేశాల్లో చనిపోయారని పార్లమెంట్‌లో ప్రకటించారు. ఇందులో 1,154 మరణాలు ఒక్క సౌదీ అరేబియాలోనే నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు. యూఏఈలో 894 మంది, కువైత్‌లో 546 మంది, ఒమన్‌లో 384 మంది, బహ్రెయిన్‌లో 196 మంది, ఖతర్‌లో 106 మంది భారతీయులు కొవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 12.6 మిలియన్ల మంది భారతీయులు వివిధ దేశాల్లో నివసిస్తున్నట్టు చెప్పారు. ఇందులో 8.9 మిలియన్ల మంది కేవలం ఆరు దేశాల్లోనే ఉన్నారని తెలిపారు. యూఏఈలో అత్యధికంగా 3.4 మిలియన్ల మంది, సౌదీ అరేబియాలో 2.6 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నట్టు వెల్లడించారు. కువైత్, ఒమన్, ఖతర్, బహ్రెయిన్‌ దేశాల్లో 2.9 మిలియన్ల మంది ప్రవాసులు ఉన్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-30T02:19:31+05:30 IST