దేశంలో కొత్తగా 3,66,161 కరోనా కేసులు..

ABN , First Publish Date - 2021-05-10T16:22:16+05:30 IST

ఢిల్లీ: భారత్‌పై రోనా మహమ్మారి పంజా విసురుతోంది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా

దేశంలో కొత్తగా 3,66,161 కరోనా కేసులు..

ఢిల్లీ: భారత్‌పై రోనా మహమ్మారి పంజా విసురుతోంది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 3,66,161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3,754 మంది మృతి చెందారు. 24 గంటల్లో డిశ్చార్జ్ ఆయిన వారి సంఖ్య 3,53,818కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,26,62,575కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం 1,86,71,222 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 37,45,237కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,46,116 కాగా.. ఇప్పటి వరకు కోవిడ్ టీకా తీసుకున్న వారి సంఖ్య 17,01,76,603కు చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Updated Date - 2021-05-10T16:22:16+05:30 IST