368 పాజిటివ్ కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-09-26T06:46:51+05:30 IST
జిల్లాలో మరో 368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 42,03
కడప, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 42,037కు చేరింది.
మరో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు 428 మంది కరోనాతో మృతిచెందారు. చికిత్స పొంది కోలుకున్న 477 మందిని డిశ్చార్జి చేశారు. జిల్లాలో మొత్తం 38,285 మంది కరోనా నుంచి కోలుకున్నారు.