కరోనా రిపోర్ట్: కర్ణాటకలో 370పైగా కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-07T00:25:16+05:30 IST

కర్ణాటకలో కొత్తగా 370 పైగా కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం...

కరోనా రిపోర్ట్: కర్ణాటకలో 370పైగా కరోనా కేసులు

బెంగళూరు: కర్ణాటకలో కొత్తగా 370 పైగా కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 378 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 280 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 5,213కు చేరింది. వీరిలో 3,184 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 1,968 మంది డిశ్చార్జ్ అయ్యారు. 59 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-06-07T00:25:16+05:30 IST