36 మంది కొవిడ్‌ బాధితుల డిశ్చార్జి

ABN , First Publish Date - 2021-08-30T07:06:06+05:30 IST

తిరుపతిలోని స్విమ్స్‌, రుయాస్పత్రుల్లో కొవిడ్‌ నుంచి కోలుకున్న 38 మందిని వైద్యులు డిశ్చార్జి చేశారు.

36 మంది కొవిడ్‌ బాధితుల డిశ్చార్జి

తిరుపతి సిటీ, ఆగస్టు 29: తిరుపతిలోని స్విమ్స్‌, రుయాస్పత్రుల్లో కొవిడ్‌ నుంచి కోలుకున్న 38 మందిని వైద్యులు డిశ్చార్జి చేశారు. వీరిలో స్విమ్స్‌ శ్రీపద్మావతి కొవిడ్‌ కేంద్రంలో 15 మంది కొవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా, మరో 130 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అలాగే 29 మంది బ్లాక్‌ ఫంగస్‌తో చికిత్స పొందుతున్నట్లు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ తెలిపారు. రుయాలో 21 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 122 మంది చికిత్స పొందుతున్నారని సూపరింటెండెంట్‌ భారతి తెలిపారు.

Updated Date - 2021-08-30T07:06:06+05:30 IST