Chhattisgarh కోవిడ్ మూడో వేవ్ సమీపిస్తోంది: సీఎం
ABN , First Publish Date - 2022-01-05T01:41:16+05:30 IST
Chhattisgarh కోవిడ్ మూడో వేవ్ సమీపిస్తోంది: సీఎం
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత 10 రోజుల్లో కొత్తగా కోవిడ్ కేసులు రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్ పరీక్షల సంఖ్యను పెంచాలని, కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సీఎం సూచించారు. బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించాలని జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కరోనా మూడో వేవ్ సమీపిస్తోందని, కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, లాక్ డౌన్ విధించే నిర్ణయం చివరి అవకాశంగా ఉండాలని సీఎం అన్నారు.