రోజుకు 4 విమాన సర్వీసులు

ABN , First Publish Date - 2020-05-28T09:51:23+05:30 IST

నగరం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు రోజుకు నాలుగు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి

రోజుకు 4 విమాన సర్వీసులు

విశాఖపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి): నగరం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు  రోజుకు నాలుగు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 

- బెంగళూరు విమానం ఇక్కడ ఉదయం 7.35 గంటలకు బయలుదేరి 9.15 గంటలకు అక్కడకు చేరుతుంది.

- ఢిల్లీ విమానం ఇక్కడ సాయంత్రం 4.50 గంటలకు బయలుదేరి రాత్రి 7.10 గంటలకు అక్కడకు చేరుతుంది.

- హైదరాబాద్‌ విమానం ఇక్కడ మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి 1.45 గంటలకు అక్కడకు చేరుతుంది.

- చెన్నై విమానం సాయంత్రం ఇక్కడ 6.40 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటలకు అక్కడకు చేరుతుంది.


బుధవారం ఐదు విమానాల రాక

విశాఖ విమానాశ్రయం నుంచి బుధవారం ఐదు విమానాలు రాకపోకలు సాగించాయి. ఇండిగో సంస్థ బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, ఢిల్లీలకు ఒకటి చొప్పున సర్వీసులను నడపగా, ఎయిర్‌ ఏసియా సంస్థ బెంగళూరుకు ఒక సర్వీసు నడిపింది. ఇదిలావుండగా బుధవారం విమానాశ్రయం డైరెక్టర్‌ రాజ్‌కిశోర్‌తో పలు విషయాలపై చర్చించినట్టు సలహా కమిటీ ప్రతినిధులు కుమార్‌రాజా, నరేశ్‌కుమార్‌, డీఎస్‌ వర్మలు తెలిపారు. వర్షాకాలం వస్తున్నందున ప్రయాణికులు తడిచిపోకుండా కెనోపీ నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని సూచించామన్నారు. లాక్‌డౌన్‌కు ముందు రోజూ 70 నుంచి 80 సర్వీసులు నడిచేవని, ఇప్పుడు పదికి మించడం లేదని, త్వరలోనే మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు. 

Updated Date - 2020-05-28T09:51:23+05:30 IST