పత్రికా కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడి... నలుగురు జర్నలిస్టులకు గాయాలు

ABN , First Publish Date - 2021-09-09T15:13:38+05:30 IST

త్రిపుర రాజధాని అగర్తలలో ఒక పత్రికా కార్యాలయంపై...

పత్రికా కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడి... నలుగురు జర్నలిస్టులకు గాయాలు

అగర్తలా: త్రిపుర రాజధాని అగర్తలలో ఒక పత్రికా కార్యాలయంపై భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఉదంతంలో కొందరు బీజేపీ నేతల హస్తముందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ‘ప్రతివాదీ కలం’ అనే స్థానిక దినపత్రిక కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురు జర్నలిస్టులు గాయపడ్డారు. 


కొంతమేరకు ఆస్తినష్టం కూడా వాటిల్లింది. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ‘ప్రతివాదీ కలం’ సంపాదకుడు అనల్ రాయ్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన అనంతరం అగర్తల ప్రెస్ క్లబ్ సెక్రటరీ ప్రణబ్ సర్కార్‌తో పాటు పలు మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు  ‘ప్రతివాదీ కలం’ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ దాడులకు పాల్పడ్డవారిని వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో అధికార బీజేపీ విపక్ష భారతీయ కమ్యూనిస్టు పార్టీ ల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Updated Date - 2021-09-09T15:13:38+05:30 IST