కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం..

ABN , First Publish Date - 2021-12-24T23:11:13+05:30 IST

కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం..

కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం..

వడోదర: గుజరాత్ రాష్ట్రంలోని వడోదర సిటీ సమీపంలో ఓ రసాయన కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు సంభవించడంతో నలుగురు మృతి చెందగా, 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో నాలుగు సంవత్సరాల చిన్నారి కూడా ఉన్నారు. కంపెనీలో కార్మికులు పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

Updated Date - 2021-12-24T23:11:13+05:30 IST