బ్యాంక్‌ ఖాతా నుంచి 4 లక్షలు మాయం!

ABN , First Publish Date - 2021-03-07T12:51:02+05:30 IST

ఓ క్రాఫ్ట్‌ డిజైనర్‌ బ్యాంకు ఖాతా నుంచి దాదాపు రూ.4 లక్షలు మాయమయ్యాయి

బ్యాంక్‌ ఖాతా నుంచి 4 లక్షలు మాయం!

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : ఓ క్రాఫ్ట్‌ డిజైనర్‌ బ్యాంకు ఖాతా నుంచి దాదాపు రూ.4 లక్షలు మాయమయ్యాయి. దీంతో బాధితురాలు సైబర్‌క్రైమ్స్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. బజార్‌ఘాట్‌కు చెందిన ఓ మహిళ క్రాఫ్ట్‌డిజైనర్‌. ఆమె బ్యాంక్‌ ఖాతాను టార్గెట్‌చేసి సైబర్‌ కేటుగాళ్లు పలు విడుతలుగా రూ.3.90లక్షలు చోరీచేశారు. డబ్బులు డెబిట్‌ అవుతున్నట్లు తనకు తెలియలేదని, తన ప్రమేయం లేకుండానే డబ్బు మాయం అయ్యాయని ఫిర్యాదుచేసినట్లు సైబర్‌క్రైమ్స్‌ ఎస్సై సైదిరెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-03-07T12:51:02+05:30 IST