ఉగ్రవాద ప్రేరేపిత దాడుల్లో 40 మంది పౌరుల మరణం: కేంద్రం

ABN , First Publish Date - 2021-11-30T22:16:12+05:30 IST

ఉగ్రవాద ప్రేరేపిత దాడుల నుంచి పౌరులను కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని, రానున్న కాలంలో పౌరులకు మరింత రక్షణ కల్పిస్తామని నిత్యానంద్ అన్నారు. ఉగ్రవాదులను ఉగ్ర కార్యకలాపాలను..

ఉగ్రవాద ప్రేరేపిత దాడుల్లో 40 మంది పౌరుల మరణం: కేంద్రం

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో ఈ యేడాది జరిగిన ఉగ్రవాద ప్రేరేపిత దాడుల్లో 40 మంది పౌరులు మరణించారని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడుల వివరాలను తెలియజేశారు. ‘‘ఈ ఏడాది నవంబర్ 15 వరకు జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద ప్రేరేపిత దాడుల్లో 40 మంది పౌరులు మరణించారు. అలాగే మరో 75 మంది గాయపడ్డారు. వీరితో పాటు 35 మంది సైనికులు చనిపోగా, 86 మంది గాయపడ్డారు’’ అని లోక్‌సభలో నిత్యానంద్ పేర్కొన్నారు.


ఉగ్రవాద ప్రేరేపిత దాడుల నుంచి పౌరులను కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని, రానున్న కాలంలో పౌరులకు మరింత రక్షణ కల్పిస్తామని నిత్యానంద్ అన్నారు. ఉగ్రవాదులను ఉగ్ర కార్యకలాపాలను నివారించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2021-11-30T22:16:12+05:30 IST