మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన 40 ఫర్నిచర్ గోడౌన్లు

ABN , First Publish Date - 2021-10-16T21:19:38+05:30 IST

మహారాష్ట్రలోని భివాండిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 40 ఫర్నిచర్ గోడౌన్లు అగ్నికి ఆహుతయ్యాయి

మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన 40 ఫర్నిచర్ గోడౌన్లు

థానే: మహారాష్ట్రలోని భివాండిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 40 ఫర్నిచర్ గోడౌన్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఇక్కడి కషేలి ప్రాంతంలోని మహాలక్ష్మి ఫర్నిచర్ మార్కెట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.


ఓ గోడౌన్‌లో అంటుకున్న మంటలు ఒక్కసారిగా చెలరేగి 40 గోడౌన్లకు వ్యాపించాయని, అవన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయని థానే మునిసిపల్ కార్పొరేషన్ రీజనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్  (ఆర్‌డీఎంసీ) చీఫ్ సంతోష్ కదమ్ తెలిపారు. నిన్నటి నుంచి మంటలను అదుపు చేస్తుండగా ఈ తెల్లవారుజామున 4.45 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2021-10-16T21:19:38+05:30 IST