40 వేలు దాటేశాయ్..
ABN , First Publish Date - 2020-09-23T06:51:05+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 40 వేల మార్కును దాటేశాయి. కొత్తగా మరో 589 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.
మరో 589 పాజిటివ్ కేసులు
ముగ్గురి మృతి
కడప, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 40 వేల మార్కును దాటేశాయి. కొత్తగా మరో 589 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40,524కు చేరింది. మరో ముగ్గురు మృతి చెందారు.
ఇప్పటి వరకు మొత్తం 419 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి కోలుకున్న 631 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 36,781 మంది చికిత్స పొంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2393 మంది హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. 3,64,711 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మంగళవారం ఒక్కరోజే 5067 మంది నుంచి త్రోట్, స్వాబ్ శాంపిల్స్ సేకరించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.