4వేళ ఏళ్లనాటి లడ్డూలు కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఎక్కడంటే..

ABN , First Publish Date - 2021-03-28T01:49:27+05:30 IST

హరప్పా నాగరికత కాలం నాటి లడ్డూ వంటి తినుబండారాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రాజస్థాన్‌లోని ఓ ప్రాంతంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో లడ్డూలవంటి పదార్థం బయపటడింది. అనేకరకాల ప్రొటీన్లతో నిండిన ధాన్యాలను వినియోగించి..

4వేళ ఏళ్లనాటి లడ్డూలు కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఎక్కడంటే..

ఇంటర్నెట్ డెస్క్: హరప్పా నాగరికత కాలం నాటి లడ్డూ వంటి తినుబండారాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రాజస్థాన్‌లోని ఓ ప్రాంతంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో లడ్డూలవంటి పదార్థం బయపటడింది. అనేకరకాల ప్రొటీన్లతో నిండిన ధాన్యాలను వినియోగించి ఈ లడ్డూలను తయారు చేశారని, దీనిని బట్టి అప్పట్లో చాలా పోషకాహారాలు కలిగిన ఆహారం తీసుకున్నట్లు తెలుస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించాడు. లక్నోకు చెందిన బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్, ఢిల్లీకి చెందిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంస్థలు రెండూ కలిసి రాజస్థాన్‌లోని బిన్‌జోర్ ప్రాంతంలో ఉన్న హరప్పా నాగరికతకు సంబంధించిన ఆర్కియాలజికల్ సైట్‌లో చాలా కాలంగా పరిశోధనలు జరుపుతున్నాయి. అయితే 2017లో వారికి ఓ 7 లడ్డూలవంటి పదార్థాలు భించాయి. వాటిపై పరిశోధనలు చేసిన ఆర్కియాలజీ శాస్త్రవేత్తలు వీటిని అనేకరకాల ప్రొటీన్లు ఉన్న తినుబండారాలుగా గుర్తించారు.


పరిశోధనల అనంతరం ఈ లడ్డూలు దాదాపు 2600 బీసీఈ కాలానికి చెందినవని శాస్త్రవేత్తలు చెప్పారు. వీటిని చాలా జాగ్రత్తగా నిల్వ చేశారని, అయితే ఇవి నీరు తగలడం వల్ల పర్పుల్(లేత వంకాయ రంగు’లోకి మారిపోయాయని వారు చెప్పారు. దీనికి సంబంధించిన శాంపిల్స్‌ను బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ అధికారులకు కూడా అందించినట్లు ఢిల్లీ సంస్థ వెల్లడించింది.

Updated Date - 2021-03-28T01:49:27+05:30 IST