గుజరాత్‌లో మరో 405 మందికి కరోనా.. 14,468కి చేరిన కేసులు..

ABN , First Publish Date - 2020-05-26T03:54:33+05:30 IST

గుజరాత్‌లో ఇవాళ మరో 405 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది...

గుజరాత్‌లో మరో 405 మందికి కరోనా.. 14,468కి చేరిన కేసులు..

అహ్మదాబాద్: గుజరాత్‌లో ఇవాళ మరో 405 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 14,468కి చేరినట్టు అధికారులు తెలిపారు. కాగా ఈ మహమ్మారి కారణంగా మరో 30 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 888కి చేరింది. కొత్తగా 224 మంది కొవిడ్-19 విష కౌగిలి నుంచి బయటపడ్డారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,636కు చేరింది. ప్రస్తుతం 6,944 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారనీ.. 109 మందికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు.  

Updated Date - 2020-05-26T03:54:33+05:30 IST