ఇండోనేషియాలో భారీ భూకంపం.. 42 మంది మృతి
ABN , First Publish Date - 2021-01-16T13:05:58+05:30 IST
ఇండోనేషియాలోని సులవేసి దీవిలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2గా తీవ్రత నమోదైంది.
రిక్టర్పై 6.2 తీవ్రత నమోదు
మముజు, జనవరి 15: ఇండోనేషియాలోని సులవేసి దీవిలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2గా తీవ్రత నమోదైంది. భూకంప తీవ్రతకు భారీ సంఖ్యలో ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. 42 మంది మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. 600 మందికి పైగా గాయపడ్డారన్నారు. భవనాల శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని చెప్పారు.