అస్సాంలో కొత్తగా 48 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-26T01:20:15+05:30 IST

ఇన్నాళ్లూ కరోనా బారినుంచి తప్పించుకున్న ఈ శాన్య రాష్ట్రాలు ఇప్పడు మహమ్మారి కోరల్లో చిక్కుకుంటున్నాయి. రోజురోజుకూ ఆ రాష్ట్రాల్లో...

అస్సాంలో కొత్తగా 48 కరోనా కేసులు

దిస్‌పుర్: ఇన్నాళ్లూ కరోనా బారినుంచి తప్పించుకున్న ఈ శాన్య రాష్ట్రాలు ఇప్పడు మహమ్మారి కోరల్లో చిక్కుకుంటున్నాయి. రోజురోజుకూ ఆ రాష్ట్రాల్లో కూడా కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అస్సాంలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నేడు నమోదైన కేసులపై రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం గత 24 గంటల్లో 48 కరోనా కేసులు కొత్తగా రాష్ట్రంలో నమోదయ్యాయి. వీటితో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 514కు చేరింది. నలుగురు మరణించారు. ఇప్పటివరకు 62 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 445 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-05-26T01:20:15+05:30 IST