నాలుగో అంతస్తు నుంచి పడి విద్యార్థి దుర్మరణం

ABN , First Publish Date - 2021-10-21T14:00:50+05:30 IST

స్థానిక తిరువికనగర్‌లో నాలుగో అంతస్తు నుంచి పడి ప్లస్‌ వన్‌ విద్యార్థి మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. తిరువిక నగర్‌ ఎస్‌ఆర్‌పీ ఆలయ వీధి ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సత్యేంద్రన్‌-సెల్వి దంపతులకు ఇద్దరు

నాలుగో అంతస్తు నుంచి పడి విద్యార్థి దుర్మరణం

పెరంబూర్‌(chennai): స్థానిక తిరువికనగర్‌లో నాలుగో అంతస్తు నుంచి పడి ప్లస్‌ వన్‌ విద్యార్థి మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. తిరువిక నగర్‌ ఎస్‌ఆర్‌పీ ఆలయ వీధి ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సత్యేంద్రన్‌-సెల్వి దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. వారిలో పెద్ద కుమారుడు నిర్మల్‌ (11) ప్లస్‌వన్‌ చదువుతూ చెట్‌పెట్‌లోని స్మిమ్మింగ్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. మంగళవారం తెల్లవారుజామునన 4 గంటలకు శిక్షణకు వెళ్లేందుకు షూ తెచ్చుకోవడం కోసం నాలుగవ అంతస్తుకు వెళ్లిన నిర్మల్‌, హఠాత్తుగా కాలుజారి కిందపడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు అతనిని వెంటనే స్టాన్లీ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్సలు ఫలించక  అతను మృతిచెందాడు. ఈ ఘటనపై తిరువికనగర్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2021-10-21T14:00:50+05:30 IST