5 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-02-25T05:16:09+05:30 IST

జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 5 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

5 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

కడప(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 24: జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 5 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం 2741 మందికి త్రోట్‌, స్వాబ్‌ శాంపిల్స్‌ తీయగా 5 కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 963997 మందికి పరీక్షలు చేయగా 55518 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిందని, వారందరికీ చికిత్స అందించగా 54875 మంది డిశ్చార్జ్‌ అయ్యారని డీఎంఅండ్‌హెచ్‌ఓ తెలిపారు.

Updated Date - 2021-02-25T05:16:09+05:30 IST