సీఎంకు ‘వేర్హౌసింగ్’ 5 కోట్ల చెక్ అందజేత
ABN , First Publish Date - 2021-04-21T09:47:53+05:30 IST
ఏపీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ తరఫున 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు మధ్యంతర డివిడెండ్ రూ.5,02,37,898
అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ఏపీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ తరఫున 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు మధ్యంతర డివిడెండ్ రూ.5,02,37,898 చెక్కును కార్పొరేషన్ ఎండీ శ్రీకంఠనాథరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి అందజేశారు. మంగళవారం సీఎంను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆయన కలిశారు. మంత్రి కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం, మార్కెటింగ్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.