ఐదు జిల్లాల్లో కొనసాగుతున్న Covid ప్రభావం

ABN , First Publish Date - 2021-11-19T17:19:35+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో కొవిడ్‌ వైరస్‌ తగ్గుముఖం పడుతుండగా ఐదు జిల్లాల్లో ప్రభావం చూపుతోంది. గురువారం 313మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 179, మైసూరు లో 51, తుమకూరులో

ఐదు జిల్లాల్లో కొనసాగుతున్న Covid ప్రభావం

బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో కొవిడ్‌ వైరస్‌ తగ్గుముఖం పడుతుండగా ఐదు జిల్లాల్లో ప్రభావం చూపుతోంది. గురువారం 313మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 179, మైసూరు లో 51, తుమకూరులో 20, హాసన్‌లో 13, ఉత్తరకన్నడలో 11మందికి ప్రబలింది. 13 జిల్లాల్లో ఒక కేసు కూడా నమోదు కాలేదు. 369మంది కోలుకోగా నలుగురు మృతి చెందారు. వీరిలో బెంగళూరులో ఇద్దరు, రామనగర్‌, ఉత్తరకన్నడలో ఒక్కొక్కరు ఉన్నారు. 27 జిల్లాల్లో ఒక్కరూ మృతిచెందలేదు.

Updated Date - 2021-11-19T17:19:35+05:30 IST