రాజస్థాన్‌లో 50 డిగ్రీల ఉష్ణాగ్రత

ABN , First Publish Date - 2020-05-27T07:25:20+05:30 IST

ఉత్తరాదిన కూడా ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో రెండు రోజులుగా వడగాలులు, ఉక్కపోతతో

రాజస్థాన్‌లో 50 డిగ్రీల ఉష్ణాగ్రత

న్యూఢిల్లీ: ఉత్తరాదిన కూడా ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో రెండు రోజులుగా వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాజస్థాన్‌లోని చురు జిల్లాలో మంగళవారం 50 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణాగ్రత నమోదైంది. న్యూఢిల్లీలోని పాలెంలో 47.6 డిగ్రీల ఉష్ణాగ్రత నమోదైంది. మరోపక్క మే 28 వరకు అసోం, మేఘాలయల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతారణ శాఖ అంచనా వేసింది. కాగా, నైరుతీ రుతుపవనాలు నాలుగు రోజులు ఆలస్యంగా జూన్‌ 5న కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - 2020-05-27T07:25:20+05:30 IST