50 లక్షల క్యూసెక్కులు పరిగణనలోకి తీసుకోవాల్సిందే
ABN , First Publish Date - 2021-05-14T08:36:27+05:30 IST
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపు ప్రాంతాల మదింపులో 50 లక్షల క్యూసెక్కుల వరదను ప్రామాణికంగా తీసుకోవాల్సిందేనని తెలంగాణ జలవనరుల శాఖ స్పష్టం చేసింది
పోలవరం ముంపు ప్రాంతాలపై తెలంగాణ
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపు ప్రాంతాల మదింపులో 50 లక్షల క్యూసెక్కుల వరదను ప్రామాణికంగా తీసుకోవాల్సిందేనని తెలంగాణ జలవనరుల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్కు రాసిన లేఖలో తన వైఖరిని తెలియజేసింది. పోలవరం ప్రాజెక్టులోకి చేరే వరద నీటితో ప్రభావితమయ్యే ముంపు ప్రాంతాలపై సర్వే చేపట్టాలంటూ ఇరు తెలుగు రాష్ట్రాలను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధికారులు సర్వే చేపట్టారు. అయితే... 36 లక్షల క్యూసెక్కుల వరదను ప్రామాణికంగా తీసుకుని సర్వే చేశారు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.