ఆశా వర్కర్ కుటుంబానికి 50 లక్షలు: నాని
ABN , First Publish Date - 2021-01-26T09:15:10+05:30 IST
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనారోగ్య కారణాలతో మృతిచెందిన ఆశావర్కర్ బొక్కా విజయలక్ష్మి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది
తాడేపల్లి, జనవరి 25: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనారోగ్య కారణాలతో మృతిచెందిన ఆశావర్కర్ బొక్కా విజయలక్ష్మి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఆశావర్కర్గా 15 ఏళ్లు సేవలందించిన ఆమె కుటుంబానికి ప్రభుత్వం అం డగా ఉంటుందని మంత్రి ఆళ్ల కాళీకృష్ణ (నాని), హోంమంత్రి సుచరిత తెలిపారు. గుంటూరుజిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో సోమవారం వారు విజయలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్థిక సాయంతో పాటు, కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు వచ్చే విధంగా సీఎం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు.